మటన్ కూర తక్కువైందని అధికారినే కొట్టిన ఖైదీ

స్వతంత్ర వెబ్ డెస్క్: కేరళలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మటన్ కూర తక్కువైందని అధికారినే కొట్టాడు ఒక ఖైదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన వయనాడ్ కు చెందిన ఫైజాస్ పూజపురా అనే ఖైదీ సెంట్రల్ జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉన్నాడు. ఈ క్రమంలో తనకు వడ్డించిన మటన్ కూరతో సహా అతనికి అందించిన ఆహరం పరిమాణం తక్కువగా ఉందని జైలు అధికారులపై అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాదు దాడికి సైతం దిగాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రస్తుత అతడిపై కేసు నమోదు చేశారు. అందరు ఖైదీల కన్నా తనకు ఎక్కువ మటన్ కావాలని కోరుతూ ఫైజాస్ దాడికి పాల్పడినట్లు సీనియర్ జైలు అధికారి తెలిపారు.

సాధారణంగా వారంలో ఒక రోజు ఖైదీలకు మటన్ కూర వడ్డిస్తామని, మామూలుగా ఇచ్చే పరిమాణం కన్నా ఎక్కువగా కావాలని అడిగాడు, ఈ వివాదంతో గొడవను ప్రారంభించాడు, వడ్డించిన మటన్ కర్రీని చెత్తబుట్టలో పారేశాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన ఖైదీ ఇతర జైళ్లలో కూడా ఇలాగే చేసేవాడని, ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డుకు తరలించినట్లు తెలిపారు.

 

 

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్