స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారని… 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈనెల 10వ తేది జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,60,329 మంది దరఖాస్తు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
0
562
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


