స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సహనిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న(సోమవారం) విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోమవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. కాగా ఈనెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని హాజరుకాలేదు. అనంతరం ఈనెల 19న రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతూ ఆరోజు కూడా విచారణకు డుమ్మా కొట్టారు. దీనిపై సీరియస్ అయిన సీబీఐ అధికారులు కచ్చితంగా సోమవారం విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
0
343
Previous article
Latest Articles
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో...
- Advertisement -
- Advertisement -


