స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సహనిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న(సోమవారం) విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోమవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. కాగా ఈనెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని హాజరుకాలేదు. అనంతరం ఈనెల 19న రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతూ ఆరోజు కూడా విచారణకు డుమ్మా కొట్టారు. దీనిపై సీరియస్ అయిన సీబీఐ అధికారులు కచ్చితంగా సోమవారం విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
0
363
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


