స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరుస తీపికబుర్లు అందిస్తోంది. మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుధ్ద్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన సీఎం కేసీఆర్.. తాజాగా కల్లు గీత కార్మికులకు శుభవార్త అందించారు. రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికులకు ప్రత్యేక బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం తరపున రూ.5లక్షల బీమా అందనుంది. నేరుగా బాధితుల కుటుంబ ఖాతాలోనే డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గీత కార్మికుల బీమాకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ఎక్సెజ్, ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కల్లు గీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
0
260
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


