స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనంతరం మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్న బాలినేనిని తాడేపల్లి రావాలని కబురు పంపించారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని జగన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గించేలా కొందరు పనిచేస్తున్నారని సీఎం జగన్కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన జగన్.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా బాలినేనిని బుజ్జగించినట్టు సమాచారం.
తాడేపల్లిలో బాలినేనిని బుజ్జగించిన సీఎం జగన్
0
308
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


