స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనంతరం మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్న బాలినేనిని తాడేపల్లి రావాలని కబురు పంపించారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని జగన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గించేలా కొందరు పనిచేస్తున్నారని సీఎం జగన్కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన జగన్.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా బాలినేనిని బుజ్జగించినట్టు సమాచారం.
తాడేపల్లిలో బాలినేనిని బుజ్జగించిన సీఎం జగన్
0
286
Latest Articles
ఇండియా కూటమి సమావేశంలో 5 కీలక నిర్ణయాలు
ఇండియా కూటమి సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1.SIR, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై CJIకి లేఖ రాయాలని నిర్ణయం
2.నీట్, CBSE పరీక్షార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ..
విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా...
- Advertisement -
- Advertisement -


