స్వతంత్ర వెబ్ డెస్క్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గువాహటిలోని జలూక్బరీ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి
0
296
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


