స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబసభ్యులతో పాటు లోకేశ్ చిన్ననాటి స్నేహితులందరూ పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనగసాగుతోంది. ఈ సందర్భంగా మోతుకూరు గ్రామం వద్ద 100వ రోజు ఫైలాన్ లోకేశ్ ఆవిష్కరించనున్నారు. మరోవైపు లోకేశ్ కు సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన మహా పాదయాత్ర 34 నియోజకవర్గాల్లో మొత్తం 1268 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.
లోకేశ్ యువగళం పాదయాత్రకు నేటితో 100 రోజులు
0
327
Previous article
Latest Articles
ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్రావు.. కొందరు కుట్రలు చేశారు
ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -
- Advertisement -


