పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తప్పించేందుకు దుర్గారావు సహకరించారు. ఈ కేసులో ఇప్పటి కే దుర్గారావుని సస్పెండ్ చేశారు సిపి కొత్తకోట శ్రీనివాస్. సస్పెన్షన్ తర్వాత సీఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడు దుర్గారావు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
0
700
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


