తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బస్ ప్రయాణ పథకం కారణంగా గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించు కోలేక ఆటో డ్రైవర్ సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సోమాజిగూడ బీఎస్ మక్తాలో సతీష్ తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకుని సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్ మక్తాలోని కిరాయి ఇంట్లో నివాసం ఉండే 35 ఏళ్ల సతీష్గౌడ్ 15 ఏళ్లుగా ఆటో నడిపి జీవనం సాగిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన సతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.