తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బస్ ప్రయాణ పథకం కారణంగా గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించు కోలేక ఆటో డ్రైవర్ సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సోమాజిగూడ బీఎస్ మక్తాలో సతీష్ తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకుని సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్ మక్తాలోని కిరాయి ఇంట్లో నివాసం ఉండే 35 ఏళ్ల సతీష్గౌడ్ 15 ఏళ్లుగా ఆటో నడిపి జీవనం సాగిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన సతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం – ఆటో డ్రైవర్ బలి
0
363
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


