పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో పదిమంది పోలీసు సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ లోని ద్రాబన్ ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉగ్రవా దులు మొదట స్నైపర్స్ ను ఉపయోగించి, కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రనేడ్స్ ను విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యుల మని ప్రకటించుకోలేదు. 2022 నుంచి , పాకిస్తాన్ తాలిబన్లు- ప్రభుత్వానికీ మధ్య కాల్పుల విరమణ రద్దయిన తర్వాత ఇస్లామిక్ మిలిటెంట్లు భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. ఈ దాడి పాక్ తాలిబన్ల పనేనని అనుమానిస్తున్నారు.