పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి టీడీపీ అధిష్టానం నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.. పెనమలూరు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్ధసారధి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను కూడా అధినాయకత్వం నియమించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారు. అయితే పెనమలూరులో బోడె ప్రసాద్ ఆల్రెడీ ఉండటంతో ఆయనకు పార్టీ బలహీనంగా ఉన్న నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది