జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు శామిర్ పేట్లోని లియోని రిసార్టుకు చేరుకుంటారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు.