జనసేన పార్టీ జెండా దిమ్మ కూల్చివేత…ఆందోళనకు దిగిన జనసైనికులు

     కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అర్థరాత్రి జనసేన పార్టీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం తీవ్ర కలకలం సృష్టించింది. 11వ డివిజన్ లో జనసేన ఇంచార్జ్ బండి కరుణాకర్ గత కొన్ని రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మెను ఏర్పాటు చేయగా ఆ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్థరాత్రి 1గంట సమయంలో ప్రొక్లైన్ తో కూల్చివేశారు. జెండా దిమ్మ కూల్చివేత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా రెండు రోజుల క్రితమే ఈ జెండా దిమ్మను తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు రాగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో వారు వెనుతిరిగి వెళ్లారు. ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో జెండా దిమ్మ కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కూల్చివేసిన జెండా దిమ్మను పరిశీలించారు. కూల్చిన జెండా దిమ్మ వద్ద జనసైనికులు ఆందోళనకు దిగారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్