ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేశ్… జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ఆయన.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్లా ఉంటుందని లోకేశ్ సెటైర్లు వేశారు.
ఇచ్చాపురంలో టీడీపీ శంఖారావం సభ
0
391
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


