కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాన్వాయ్ మీదకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ కాన్వాయ్ మీదకు ఒక్కసారిగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ యువకుడిని బీజేపీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. కాగా మోదీ పర్యటనలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని హుబ్బలిలో నిర్వహించిన రోడ్షోలో కూడా ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్ మీదకు దూసుకొచ్చిన యువకుడు
0
291
Previous article
Next article
Latest Articles
నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్
బంజారాహిల్స్లోని నిలోఫర్ బిల్డింగ్ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -
- Advertisement -


