కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాన్వాయ్ మీదకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ కాన్వాయ్ మీదకు ఒక్కసారిగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ యువకుడిని బీజేపీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. కాగా మోదీ పర్యటనలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని హుబ్బలిలో నిర్వహించిన రోడ్షోలో కూడా ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్ మీదకు దూసుకొచ్చిన యువకుడు
0
307
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


