25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

మణిపూర్ లో భారత మాతను చంపేశారు.. లోక్ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉద్వేగంతో ప్రసంగించారు. ప్రధాని మోదీ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దృష్టిలో మణిపూర్ (Manipur) దేశంలో లేదని.. మణిపూర్ లో భరత మాతను హత్య చేశారని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు.. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని కూడా చంపారని ఆరోపించారు. హిందుస్తాన్ ను  మర్డర్  చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ హిందుస్తాన్ మాట వినరని, కేవలం ఇద్దరి మాటే వింటారని ఫైర్ అయ్యారు. లంకను కాల్చింది రావణుడి అహంకారమే అంటూ వ్యాఖ్యలు చేశారు రాహుల్.  దీంతో సభలో బీజేపీ (BJP)సభ్యులు నిరసన తెలిపారు. లోక్ సభలో రాహుల్ ప్రసంగం వాడీ వేడిగా సాగింది. ప్రధాని మోదీ వల్లే మణిపూర్ రెండుగా విడిపోయింది.. మణిపూర్ దేశంలో భాగం కాదా.. ప్రధాని మోదీ మణిపూర్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ ఫైర్ అయ్యారు. దీంతో రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య పోటా పోటీ వాగ్వాదం జరిగింది. దీంతో విపక్షాల మాటలతో లోక్ సభ దద్దరిల్లింది.

Latest Articles

మేడిగడ్డపై తుది నివేదిక రెడీ

మేడిగడ్డపై తుది నివేదిక వచ్చేసింది. నిపుణుల కమిటీ తమ నివేదికను NDSA ఛైర్మన్‌కు అందించింది. కేంద్ర జలశక్తి ఆమోదం తర్వాత సంబంధిత రిపోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్