విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాం గం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణా లు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపో యారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పై అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు.
ఆందోళన కలిగిస్తున్న డయేరియా మరణాలు
0
208
Previous article
Latest Articles
మల్లారెడ్డిపై వేటు తప్పదా?
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా...? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా...? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి...
- Advertisement -
- Advertisement -


