Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

తిరుమల తొలిగడపలో కొలువైన విజయ దుర్గమ్మ

      అష్టాదశ శక్తి పీఠాల్లో జరిగే విధంగా, కంచి పీఠం సంప్రదాయానుసారం, శాస్తోక్తంగా ఇక్కడ విజయ దుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తారు. దేశంలోనే మూడో పెద్ద విజయదుర్గా ఆలయంగా పేరొందింది శ్రీ విజయ దుర్గా మాత ఆలయం.

       తిరుమల తొలి గడప కడపలో నెలకొన్న పవిత్ర దేవాలయాల్లో అతి ముఖ్యమైనది శ్రీ విజయ దుర్గా మాత ఆల యం. ఏపీలో నెలకొన్న ఎన్నో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఇక్కడి విజయ దుర్గా దేవి ఆలయం ఎన్నో విశిష్టతల నిలయంగా పేరు పొందింది. యావత్ దేశంలోనే విజయదుర్గా దేవాలయాల్లో మూడో ప్రముఖ దివ్యాల యంగా ఈ దేవళం ప్రసిద్ధి పొందింది. పెన్నా నది పరవళ్లు, పాల కొండలు, ఇరువైపుల నల్లమల అడవుల సొబగులు.. ఇదీ కడప నగర పరిసరాల్లో దర్శనమిచ్చే ప్రకృతి వైభవం. నగర అంతర్భాగంలో చూస్తే అద్భుత ఆధ్యాత్మిక వైభవం కనిపిస్తుంది. నగరంలో ఎన్నో దేవళాలు ఉన్నాయి. అయితే, నగర శివారు వినాయకనగర్ లో నెలకొని ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయం ఎన్నో విశిష్టతల నిలయం కీర్తి ప్రతిష్ఠలు పొందింది.

     భారతదేశంలో గోవాకు సమీపంలోని పాండా నగరంలో, కాశ్మీర్ లో విజయ దుర్గా అమ్మవారి ఆలయాలు నెలకొని ఉన్నాయి. పాండా నగరంలో దాదాపు నాలుగున్నర శతాబ్దాలకు పూర్వం అమ్మవారి ఆలయం నిర్మితమైనట్టు ఆ ఆలయ చరిత్ర చెబుతోంది. విజయదుర్గ మాత మూడో దివ్యక్షేత్రంగా కడప భాసిల్లుతోంది. ఇక దక్షిణ భారత దేశంలో అయితే ఏకైక పవిత్ర విజయదుర్గా ఆలయంగా ఈ దేవాలయం కీర్తి ప్రతిష్ఠలు పొందుతోంది.

    ప్రాచీన ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నట్టు, ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా కడప విజయ దుర్గాదేవి ఆలయ నిర్మితమైంది. ఏడాది మొత్తం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత.ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా, పురాత ఆలయాల మాదిరి కడప విజయదుర్గా అమ్మవారి ఆలయం నిర్మించారు. వితరణశీలి, దైవ బాంధవులు, భక్తాగ్రేసరులు సుధా మల్లికార్జునరావు ఈ ఆలయాన్ని అందమైన నిర్మాణ శైలిలో పటిష్టంగా నిర్మించారు. అమ్మను దర్శించి తరించండి అని ఆహ్వానిస్తున్నట్టుగా సుందరమైన సింహద్వారం ఆలయంలో ప్రవేశించగానే స్వాగతం పలుకుతుంది. యాత్రికులకు, బాటసారులకు బహుదూరం నుంచి గమనించినా అమ్మవారి నివాసం ఇదే.. అని సూచించే విధంగా 46 అడుగుల ఎత్తైన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం ఎదుట సింహ వాహనం ఎంతో ఠీవిగా దర్శనమిస్తుంది.

     దేవాలయ ప్రాంగణంలో సుందరమైన కళాకృతులతో ఏర్పాటు చేసిన నిర్మాణాలు చూపరులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆకాశాన్ని తాకుతుందా అని భ్రమ కల్గించేలా ఉన్న ధ్వజస్తంభం, సింహవానం తిలకించిన భక్తులు అనంతర ఆలయ మండపంలో అద్భుతరీతిలో ఉన్న శ్రీ చక్రాన్ని చూసి భక్తిపారవశ్యానికి లోనవుతారు. పరమ పవిత్రమైన ఈ శ్రీచక్రమేరువును వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, అశేష భక్తజన సందోహం నడుమ ప్రతిష్ఠించినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

      సహజంగా అన్ని చోట్ల భక్తుల గోత్రనామాలతో అర్చకులే శ్రీ చక్రార్చన చేస్తారు. అయితే, ఇక్కడి విజయదుర్గాదేవి ఆలయంలో భక్తుల స్వహస్తాలతో, స్వయంగా శ్రీ చక్రార్చన చేయిస్తారు. “మూలమంత్రాత్మికా మూలకూటత్రయ” అంటే… మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహా కాళీ శక్తులతో కూడిన శ్రీచక్రం అని అర్థం. శ్రీ చక్ర పూజచేసిన భక్తులకు సర్వ శుభాలు జరుగుతాయని అర్చకస్వాములు తెలియజేస్తున్నారు. శ్రీచక్రార్చన చేస్తే వాగ్దేవి మాత విద్యను ప్రసాదిస్తుందని, మహాలక్ష్మీ మాత సంపద కలగజేస్తుందని, మహాకాళీ అమ్మవారి రూపంలో పార్వతీ అమ్మవారు శక్తి సౌభాగ్యాన్ని కలగజేస్తారని పండిత శ్రేష్ఠులు, అర్చకస్వాములు చెబుతున్నారు. లలితా సహస్రనామావళిలో ఈ విషయం విస్పష్టంగా ఉందని తెలియజేస్తున్నారు.

     అష్టాదశ పీఠాల్లో జరిగే విధంగా, కంచి పీఠం సంప్రదాయానుసారం, శాస్తోక్తంగా కడప విజయ దుర్గా అమ్మవారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దాదాపు ఏడాది పొడవునా ఈ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు జరగడం విశేషం. ప్రతి పర్వదినం నాడు….ఆ పర్వదినానికి అనుగుణంగా ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తారు.

     కడప విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో జరగని పూజ లేదంటే అతిశయోక్తి కాదేమో. మహా చండీ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ కుబేర హోమం, లక్ష్మీనారాయణ హోమం, ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక హోమం, గోపూజ, శ్రీ చక్ర నవావరణ పూజ, రాహుకాల పూజ, మహా రుద్ర హవనం, అమ్మవారి కళ్యాణమహోత్సవం…ఇలా..ఎన్నో, ఎన్నెన్నో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు.సంపూర్ణ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఈ దివ్య, భవ్య ఆలయంలో అష్టాదశ పీఠాల్లో జరిగే అన్ని పూజలు…అక్కడ జరిగిన విధంగా చేస్తారు. కంచి పీఠం సంప్రదాయానుసారం, శాస్తోక్తంగా ఇక్కడి అర్చకస్వాములు విజయ దుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తారు.ఆలయంలో అమ్మవారికి విశేషరీతిలో జరిగే పూజాదికాలతో ఆ తల్లి దివ్యశక్తి రూపిణిగా దర్శనమిస్తుందని ఆలయ అర్చకస్వాములు తెలియజేస్తున్నారు. మహిమాన్విత అమ్మవారుగా ఇక్కడి విజయదుర్గా అమ్మవారు కీర్తి ప్రతిష్ఠలు పొందడంతో…ఈ ఆలయానికి జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

     శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో ప్రతి రోజు అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా, అత్యంత భక్తిప్రదంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం, ఆలయంలో రాహుకాల పూజలు ఘనంగా చేస్తారు. రాహుకాలం లో పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాహుకాల పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సర్ప దోషాలు, కుజ దోషాలు పరిహారం చేసుకుంటారు. పంచ సర్ప శిరస్సులతో రాహువు, ఏక సర్ప శిరస్సుతో కేతువు దర్శన మిస్తారని ఈ రాహుగ్రస్థ, కేతుగ్రస్థ దోషాల నివారణకు రాహుకాల పూజలు నిర్వహించుకోవాలని అర్చకస్వాములు తెలియజేస్తున్నారు. దాదాపు 360 రకాల సర్పజాతులు దోష నివారణకు ఈ పూజలు ఆవశ్యకమని తెలియజేస్తున్నారు.

     ప్రతి మంగళవారం నిర్వహించే రాహుకాల పూజకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్టు అర్చకస్వాములు తెలిపారు. ప్రతి చోట రాహు కేతువులకు మాత్రమే పూజ చేస్తే ఇక్కడ నవగ్రహాలకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాహు, కేతువులకు ఖడ్గమాల స్తోత్రం ద్వారా శాంతింప చేస్తామని చెప్పారు. శ్రీ విజయ దుర్గ దేవి అమ్మవారి అష్టోత్తర నామావళి చేసిన అనంతరం రాహు కేతువులకు రెండు దీపాలు వెలిగిస్తామని తెలిపారు. 2002లో ముగ్గురితో మొదలైన రాహుకాల పూజ ఇప్పుడు వందలాది మందికి చేరిందని చెప్పారు. నవగ్రహ శాంతి పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేయడం ఇక్కడ విశేషం. చెడు ఫలితాల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితం పొందడానికి రాహుకాల సమయంలో రాహు,కేతు పూజలు, అమ్మవారికి విశేషపూజలు చేస్తే.. అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి, శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు చేసుకున్న తాము అన్ని కష్టాల నుంచి బయటపడ్డామని భక్తులు చెబుతున్నారు.

     విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు నిర్వహించినా ప్రధానంగా ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దసరా సమయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రతి నెల పౌర్ణమి రోజున 108 దీపాలతో అమ్మవారికి అలంకార సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రతీ సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలల్లో సూర్య కిరణాలు అమ్మవారి పాదాలు తాకడాన్ని భక్తులు మహిమాన్విత ఘట్టంగా అభివర్ణిస్తారు.ప్రతి నిత్యం ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతున్న అతి పవిత్ర విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో ఏ ఆలయంలో జరగతి రీతిలో విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విజయ దుర్గమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, సకల దేవతల ఆహ్వానం, భేరీ నాదంతో ఆవాహన, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, సకల దేవతల రక్షణగా సింహ వాహనాన్ని ధ్వజస్తంభం పై ఉంచడం తదితర భక్తిరస కార్యక్రమాలన్ని కన్నుల పండువగా సాగాయి.

    ప్రతి నెలా పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో అమ్మవారికి 108 దీపాలతో విశేష అలంకార సేవ నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆలయంలో ప్రతి ఏడాది రెండుసార్లు మార్చి, సెప్టెంబర్ మాసాల్లో సూర్య కిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయని, ఈ సంభ్రమాశ్చర్య పరిణామాన్ని తిలకించి భక్తులు పారవశ్యం చెందుతారని తెలిపారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని ఆలయ అర్చకస్వాములు తెలిపారు.

      ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు విశేష రీతిలో సుమంగళి పూజ చేస్తారు. గత 19 ఏళ్లుగా ఈ విశేష పూజా కార్యక్రమం నిర్విఘ్నం చేస్తున్నామని ఆలయ నిర్వాహ కులు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో తమ కోర్కెలు నెరవేరాయని, తాము సుఖసంతోషాలతో ఉన్నామని, ఈ పూజలో పాల్గొన్న ఎందరో భక్తులు తమ అనుభవాలు తెలియజేస్తున్నారు. శ్రీ విజయదుర్గా దేవ్యై నమః అన్న నామాన్ని స్మరిస్తే చాలా మంచి జరుగుతుందని భక్తులు తెలియజేస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి నిత్యం జరిగే అర్చన, విశేషపూజా కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టు కుంటాయి. అర్చకస్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో బ్రాహ్మి ముహూర్త సమయం నుంచి ఈ వేడుకలు ప్రారంభిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ప్రతినిత్యం ప్రభాత సమయం లో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని మేలుకొల్పే ఘట్టం భక్తులను ఆనందపర వశులను చేస్తుంది.

   ప్రతి నిత్యం అమ్మవారికి సహస్ర నామ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి మహా మంగళ హారతులు ఇస్తారు. మహా మంగళ హారతులు తిలకించిన భక్తులకు అంతా మంగళకరంగానే ఉంటుందని, ఈ కారణంగానే ఈ హారతుల కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రోజువారీ పూజలు, అభిషేకాలు , హారతులు..అన్నీ పూర్తయ్యాక, సాయంత్ర ఆరాధన చేస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పవళింపు సేవ చేస్తారు. గణపతి, విష్ణువు, శివుడు,సూర్యుడు, దుర్గాదేవిని పంచాయతన దేవతలుగా ఆరాధిస్తారు. గణపతి ఆరగింపు ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్టువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, దుర్గా మాత పూజాప్రియ. ఆయా పర్వదినాల్లో పంచాయతన దేవతల ఆరాధన విశేష రీతిలో నిర్వహిస్తారు. ప్రతి బహుళ చతుర్దశి నాడు అమ్మవారికి విశేష రీతిలో 64 ఉపచారాలతో ప్రత్యేక పూజ చేస్తారు. దీనినే దత్తషష్ఠి ఉపచార పూజగా పేర్కొంటారు. ఇంతటి మహిమాన్విత విజయదుర్గాదేవి ఆలయం దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. భక్తుల సౌకర్యార్థం ఎన్నో వసతులు కల్పిస్తూ, ఏడాది పొడవునా అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్