కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంత్ రావు, మహేశ్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు వీహెచ్. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేవారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి .. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ .. వీహెచ్ను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సీఎంని కలిసిన వీహెచ్కు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్.. వీహెచ్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.