స్వతంత్ర వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చిట్యాల మండలం కైలాపూర్లో మహిళా కూలీలు మిరప నారు నాటుతుండగా పిడుగు పడింది. పిడుగు ధాటికి మిరప నారు నాటుతున్న వారిలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారిని సరిత (30), మమత (32)గా గుర్తించారు. ఇదిలా ఉండగా, కాటారం మండంలోని దామెరకుంటలో పిడుగుపాటుకు రాజేశ్వర్ అనే రైతు మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి. పొలంలో కలుపు తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తీవ్ర విషాదం.. భూపాలపల్లిలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి..!
0
265
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


