స్కాట్లాండ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సందర్శనా స్థలంలో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోయారు. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్త ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. జితేంద్రనాథ్, చాణక్య డూండీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నారు. మృతుల చుట్టూ ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు చెప్పారు.