ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. వైసీపీ, ఎన్డీయే కూటమి ప్రచారంతో హోరెత్తిస్తోంది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. గురువారం దశమి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఓవైపు మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టి ప్రచారం చేస్తున్నారు. మరో వైపు ప్రజాగళం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తు న్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.