25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర

   ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర కొనసాగుతోంది. మొదటి రోజే పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏపీ అసెంబ్లీకి 236 , లోక్‌సభకు 43 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తెలంగాణలో మొత్తంగా 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ రెండో రోజు కూడా హేమాహేమీలు నామినేషన్లు వేయనున్నారు. భారీ ర్యాలీగా, రోడ్‌ షోలతో కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినే షన్లు వేస్తున్నారు. ఇవాళ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్‌ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేస్తారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఇవాళే నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తారు. కాసేపట్లో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఇక బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వరి కూడా ఇవాళే నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తారు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్