24.2 C
Hyderabad
Wednesday, December 6, 2023
spot_img

ఇది మా వర్క్‌ కల్చర్‌.. శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తాం- ప్రధాని మోదీ

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరు పర్యటించారు. 8,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని. 800 ఎస్టీటీపీ జాతికి అంకితం చేశారు. మనోహరబాద్-సిద్దిపేట రైల్వే లైన్ ను విద్యుదీకరణ పనులను ప్రారంభించారు. అదే విధంగా  సిద్దిపేట-సికింద్రాబాద్  కొత్త రైలు సర్వీస్ లను ప్రారంభించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణకు రెండోసారి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది మా వర్క్ కల్చర్ అన్నారు. మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది. త్వరలో భారతీయ రైల్వే వ్యవస్థ వందశాతం ఎలక్ట్రిపికేషన్ పూర్తవుతుందన్నారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు మేము  కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్