స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు తెలిపింది. ఈ ఘటన మే 16 (మంగళవారం) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం వెల్లడించింది.
గాల్లోనే కుదుపులకు లోనైన విమానం.. ప్రయాణికులకు గాయాలు
0
249
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


