ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యమత పాలన పోయి .. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు. గత పాలకులకు నిలువు నామాలతో పంగనామాలు పెట్టారని… ఎర్రచందనం దోపిడీతో సర్కారుకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని ఆరోపించారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని చెప్పారు. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని విమర్శించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు- బండి సంజయ్
0
258
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


