ములుగు జిల్లా ముకునూరుపాలెం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతు న్నామని.. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం- వెంకటాపురం రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించా లని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లకు నీరు రాక నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు. నీటి కోసం కూలి పనులు మానుకొని ఇంటి వద్ద ఉండి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి తమను ఆదుకోవాలని కోరారు.
ములుగు జిల్లా ముకునూరుపాలెం గ్రామస్థుల ఆందోళన
0
270
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


