మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచి కత్వం పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఆపార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్నిజం నామరూపాల్లేకుండా పోయిందని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగి పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.