టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. నారా లోకేష్ ని, పార్టీ అధ్యక్షుడుగా నియమిం చాలి. ఇది తన డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేసే హక్కు తనకు ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడుగా నియమించాలని డిమాండ్ చేశారు. లోకేష్ని అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని, అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.చంద్రబాబు ఆత్మ కధలో తనకో పేజీ ఉంటుంది. టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా తాను నిలబడ్డానని బుద్దా వెంకన్న తెలిపారు.