తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ సీరియర్ నేత బొండా ఉమా అన్నారు. వంద మంది పోలీసులు నిన్న తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై రాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధిం చారని మండిపడ్డారు. ఆరు రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని బాధితులను చిత్రహింసలు పెడుతున్నారని బొండా ఉమా ఫైర్ అయ్యారు.