తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కాయి. రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. రెండు సార్లు గవర్నర్ ను విజయ్ కలిసినప్పటికి ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అటు గవర్నర్ వైఖరిని నిందిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు లోక్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. జిల్లా, మండలకేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతు తెలపేందుకు మరికొంత సమయం కావాలన్నారు.
ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీ టీవీకేను గవర్నర్ ఆహ్వానించకపోవడంతో ఆ పార్టీ నేతలు ఫైరవుతున్నారు. మెజారిటీ నిరూపణ అయ్యాకనే ప్రభుత్వ ఏర్పాటుపై ముందుకు వెళ్తామని గవర్నర్ చెప్పటినట్లు తెలుస్తోంది. అయితే సంఖ్యాబలం ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అంటోన్న గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్రపతికి ఆ పార్టీ అధినేత విజయ్ లేఖ రాశారు. అలాగే కోర్టుకు వెళ్లే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.


