ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. వేణుగోపాల్ రెడ్డి సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించని వేణుగోపాల్ రెడ్డి.. ఇండిపై రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు దాడి చేశారు. అయితే, ఇవాళ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తూర్పు దిగవల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి
0
548
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


