Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈరోజు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ అధికారులు విడుదల చెయ్యనున్నారు.
ఇక సమాచారానికొస్తే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకోవాలని రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74,873 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,997 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.