ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖాస్త్రాన్ని సంధించారు. జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ అభిమానులకు ఆమె 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. తన బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలనేది వైఎస్సార్ అభిమతం అని..అందుకే తాను, తన తల్లి విజయమ్మ తపన పడుతున్నామని చెప్పారు. ఆస్తులు సమానంగా పంచాలని జగన్ను.. తన తల్లి విజయమ్మ ఇప్పటికీ వెయ్యిసార్లు అడిగి ఉంటుందని..వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుందని తెలిపారు. అయినా తన బిడ్డలకు చెందాల్సి ఆస్తిలో ఏ ఒక్కటీ ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల తాజా లేఖ రాజకీయవర్గాల్లో మరో హాట్ టాపిక్గా మారింది.
మాజీ సీఎం జగన్పై చెల్లెలు షర్మిల మరో లేఖాస్త్రం
0
162
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


