ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్

   స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావు మాజీ సీఎం కేసీఆర్ కు గూఢచారిగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావటంతో ఆయనపై వేటు పడింది. గత ప్రభుత్వ హయంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావును సస్పెండ్‌ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

     కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచిలో డీఎస్పీ ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో ఆయన వ్యవహారశైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలటంతో తాజాగా.. ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.గత ప్రభుత్వ హయంలో ప్రణీత్ రావు కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్‌కు గూఢచారిగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఐబీ ఆపరేషన్ల పేరుతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పు డు అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. కేసీఆర్ సూచనల మేరకు ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని అన్నారు. చాలా మంది పోలీసు అధికారులు డిపార్ట్‌మెంట్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

      ప్రభుత్వం మారటంతో ఆయన్ను ఆ పోస్టు నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచే స్తుండగా.. తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ప్రణీత్ రావ్ సస్పెన్షన్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేసారు ప్రణీత్ 42 హార్డ్ డిస్క్ లను రిమూవ్ చేసిన ప్రణీత్ రావ్ ఎస్ఐబి ఆఫీస్ లోని లాగర్ రూమ్ లో ఉన్న లాప్టాప్ , హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు ప్రణీత్ రావు.కీలక నేతలకు చెందిన ఫోన్ టాపింగ్ డేటా , కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్లను ద్వంసం చేశాడు. ఎలక్ట్రిషన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్  చేయించి డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను రిమూవ్ చేసేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో డిసిఆర్బి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావ్..ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వాటర్ విడిచి వెళ్ళ రాదని ప్రణీత్రావుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ రావు వ్యవహారంపై సమగ్ర విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంది. రికార్డుల ధ్వంసానికి సంబంధించి త్వరలో కేసు నమోదుకు దాదాపు రంగం సిద్దం అయ్యింది.

Latest Articles

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల..వరంగల్‌, హన్మకొండ, పెద్దపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్