వైఎస్ వివేకా హత్యపై షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఇన్ని రోజులు వివేకా హత్యపై పలు రకాల ఆరోపణలు చేశారన్నారు. హత్యకు జరిగిన కుట్ర గురించి షర్మిల కుండబద్దలు కొట్టారని తెలిపారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారని.. గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకొన్నట్లు జగన్కు వివేకా తెలిపారు. ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో? పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగిందని తెలిపారు.. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారని విమర్శించారు..