కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత ఇప్పటికే జైలుకెళ్లిందని..రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేసీఆర్, కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆలోచనల వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ…అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని రాజగోపాల్ మండిపడ్డారు.ఇక పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని గత పాలకులు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక, సాధారణ ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. దీనికి బాధ్యులైన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారన్నారు. అంతకు ముందు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్యనేతల కాంగ్రెస్లో చేరారు.