స్వతంత్ర వెబ్ డెస్క్ : మేడిగడ్డపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ATM.. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేను సందర్శించానని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. నాసిరకం నిర్మాణం కారణంగా పలు పిల్లర్లు పగుళ్లు ఏర్పడ్డాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు రాహుల్ గాంధీ. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజిపై దిగిన ఫోటోలను షేర్ చేశారు రాహుల్ గాంధీ.
మేడిగడ్డపై రాహుల్ సంచలన ట్వీట్
0
224
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


