వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల..ఈ పర్యటన వాయిదా పడింది. అయితే సాధ్యమైనంత త్వరలో వయనాడ్లో పర్యటిస్తామని రాహుల్ గాంధీ.. తన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఆయన రాయబరేలి నుంచి కూడా విజయం సాధించారు. దీంతో వయనాడ్ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.