రక్షణ సినిమా దర్శక నిర్మాత తనకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా తనను ప్రచారానికి రమ్మం టూ బెదిరి స్తున్నారని, నటి పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశారు. మాట వినకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారని వాపోయింది. ఈ వ్యవహారం కాస్త టాలీవుడ్లో దుమారం రేపుతోంది. అయితే ఇందులో తప్పు ఎవరిది అనే దానిపై నిర్మాతల మండలి క్లారిటీ ఇచ్చింది. పాయల్ రాజ్ పుత్ ప్రచారానికి వస్తానని చెప్పి అగ్రిమెంట్లో పేర్కొంది. అయితే సినిమా రిలీజ్ టైమ్లో రాకుండా నిర్మాతను ఇబ్బంది పెడుతోందని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ప్రసన్న కుమార్ వెల్లడించారు. ప్రత్యేకంగా స్వతంత్ర టీవీతో మాట్లాడి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియజేశారు.రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది.