తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్ గంట ముందే ముగిసింది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్కు అనుమతి ఇచ్చారు. దీంతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.