Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కారు పార్టీకి ఇబ్బందిగా మారిన పాత నేతలు

  పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీ కొత్త సమస్యను ఎదుర్కొంటోందా.? బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన నేతలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో తిప్పలు తప్పడం లేదా.? ఓట్ల చీలికతో తమకు నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ భావిస్తుందా..? పార్టీ మారిన నేతలతో క్యాడర్ వెళ్లడంతో బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిందా.?

  పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి పాత నేతలు ఇబ్బందిగా మారారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది నేతలు పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన నేతలతో బిఆర్ఎస్ కేడర్ సైతం వారి బాటలోనే నడిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు చీలడం ద్వారా తమకు నష్టం జరిగే అవకాశం ఉందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చేజారకుండా బుజ్జగింపులకు దిగుతున్నారట కారు పార్టీ నేతలు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థు లకు సహకారం అందిస్తారనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తోంది.

    పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన తొమ్మిది మంది నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రా బాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బిఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్ బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్, బీజేపీ నుండి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావడంతో ఇక్కడ పోటీపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు తొలుత బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. ఆ తర్వాత తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కడియం కావ్య వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు బిఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ నుంచి వరంగల్ బరిలో దిగనున్నారు.

  మరోవైపు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణి సునీతా మహేందర్ రెడ్డిని బరిలో నిలిపారు. పట్నం దంపతులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈటెల గతంలో బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే చేవెళ్ళ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు.ఇదిలా ఉంటే జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. అయితే బీబీ పాటిల్ 2014, 2019 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ సారి మాత్రం ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇక నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు భరత్ బిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించు కున్నారు. 2019 ఎన్నికల్లో భరత్ తండ్రి రాములు బిఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. భరత్ జెడ్పీటీసీ గా ఉన్నారు. తన తండ్రితో పాటు బీజేపీలో చేరిన భరత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు.

  భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుండి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బూర నర్సయ్య గౌడ్ బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నల్గొండ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ పోటీ చేస్తున్నారు. 2014లో బిఆర్ఎస్ తరపున సీతారాం నాయక్ గెలిచారు. 2019 ఎన్నికల్లో బిఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు. ఈసారి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

    ఇలా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన నేతలు పోటీ చేస్తుండటంతో తమ ఓట్లు ఎక్కడ ఆ రెండు పార్టీల అభ్యర్థులకు మళ్లుతాయనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోందట. దీంతో తమ క్యాడర్ కు ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న బిఆర్ఎస్ కేడర్.. గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తారా లేక తమ పార్టీ నుండి కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో చేరిన అభ్యర్థు లకు సపోర్ట్ చేస్తారా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్