మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ HMDA లే అవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి 1250 గజాల భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.