ధనుష్‌పై నయనతార తీవ్ర విమర్శలు

నటుడు ధనుష్‌పై నటి నయనతార తీవ్ర విమర్శలు చేశారు. తన డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఈమేరకు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది.

నయనతార గతంలో నేనూ రౌడీనే సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌, హరో ధనుష్‌ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న మయంలోనే విఘ్నేష్‌, నయనతార ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్‌లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో ‘బియాండ్ ది ఫెయిరీటేల్‌లో’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్‌ 18న దీన్ని రిలీజ్‌ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

డాక్యుమెంటరీ ట్రైలర్‌లో నేనూ రౌడీనే షూటింగ్‌ టైంలో తీసిన 3సెకన్ల వీడియో క్లిప్‌ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూడీ బిట్స్‌ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్‌ సీరియస్ అయ్యారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ అతడిపై బహిరంగ లేఖ రాసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని.. నిజానికి అసలైన ధనుష్ వేరని.. ఫ్యాన్స్‌కు సూక్తులు చెప్పే తాను పాటించరంటూ రేంజ్‌లో విరుచుకుపడింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్