స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో లోకేశ్ తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆయన కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ నొప్పితోనే పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్లో లోకేశ్ స్కానింగ్ చేయించుకున్నారు. కాగా యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది.
భుజం నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించుకున్న లోకేశ్
0
558
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


