వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ముద్రగడ్డ పద్మనాభం

     ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానినాడ జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ్డ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ఇస్తున్న చెప్పారు.

 

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్