ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ప్రేక్షకుల్నిఒక రేంజ్ లో అలరించాయనే విషయం తెలిసిందే. ఈ సీరియల్స్ కొన్నిఏళ్లపాటు వీక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ సీరియల్స్ లోని పాత్రధారులను ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ధారా వాహికల్లోని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్ర తమ్ముడు దయ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన పవిత్రనాథ్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం ఆలస్యంగా తెలియడం గమనార్హం. తమకు కూడా ఆయన మరణ వార్త తెలియలేదని ఇంద్ర నీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.