ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని అభినందించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రశంసించడాన్ని తప్పుపడుతూ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. లోక్సభ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. తన కులం ఏదో తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయితే అనురాగ్ ఠాకూర్ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించాడు.